న్యూఢిల్లీః రష్యా, అమెరికా,బ్రిటన్ దేశాల పర్యటనకు భారత ప్రధాని వాజ్పేయి ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. మొదట ఆయన రష్యాలో పర్యటిస్తారు. ఆ తరువాత అమెరికా,బ్రిటన్ లలో పర్యటిస్తారు.
రష్యాతో పాతస్నేహాన్ని పునరుద్ధరించడం, అమెరికాతో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పడం తన పర్యటన లక్ష్యమని వాజ్పేయి ఈ సందర్భంగా చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటం గురించి ఈ మూడు దేశాధినేతలతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
ఉగ్రవాదంపై భారత్ వైఖరిని రష్యా, అమెరికా,బ్రిటన్ నేతలకు వరించడమే వాజ్ పేయి పర్యటన ప్రధానోద్దేశ్యం. వాజ్పేయి ఈ మూడు దేశాల పర్యటనకు బయలుదేరడానికి ముందు భద్రతా వ్యవహారాల కుటీతో సమావేశమయ్యారు. దేశీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన భద్రతావ్యవహారాల ఉన్నతాధికారులతో చర్చించారు.












Click it and Unblock the Notifications
