హైదరాబాద్ః గత ఇరువైమూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె హింసాకాండకు దారితీసే ప్రమాదం వున్నదన్న భయాలు నిపిస్తున్నాయి. కనుచూపుమేరలో పరిష్కారం కనిపించకపోవడంతో నిస్పృహ చెందుతున్న కార్మికులు హింసామార్గం తొక్కే అవకాశం వున్నదని మంగళవారం నాడు హైదరాబాద్ శివార్లలో జరిగిన సంఘటన ఆధారంగా భయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాజువల్ సిబ్బందితో నడుస్తున్న ఒక బస్సును మంగళవారం నాడు కొందరు హైజాక్ చేసి సిబ్బందిని తీవ్రంగా కొట్టి గాయపర్చడంతో పాటు బస్సును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర కలవరం సృష్టించింది. ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగితే కాజువల్ సిబ్బంది కూడా బస్సులు నడిపేందుకు ముందుకురాకపోవచ్చనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications
