వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ప్రభుత్వ శాఖలకు, అధికారులకుసేవా అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధ ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచి, ప్రజల కోసం పనిచేసే అధికారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈసేవా అవార్డులను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గురువారం లేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ఆరు నెలల్లో ధ ప్రభుత్వ శాఖల పనితీరుపై గురువారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వ శాఖల సామర్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెప్పారు. నిస్తేజంగా వున్న కొన్ని ప్రభుత్వ శాఖల్లో జవజీవాలు నింపాల్సిన అవసరం వున్నదని చంద్రబాబు చెప్పారు. అధికారులసేవలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఆ తరువాత ఆయన లేకరులతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే అధికారులను ప్రోత్సహించే లక్ష్యంతోసేవా అవార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓ ఉన్నత స్థాయి కుటీసేవా అవార్డులకు అర్హులైన వారిని ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, November 8, 2001, 23:53 [IST]