వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్లామాబాద్ః అమెరికాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, చీటికి మాటికి పత్రికా ప్రకటనలు ఇస్తున్న తాలిబన్లపై పాకిస్తాన్ కొరడా ఝళిపించింది. కాబూల్ లో వున్న తాలిబన్ దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఎంబసీ లోని సిబ్బంది ఆఫ్ఘన్ వెళ్ళి పోవాలని ఆదేశించింది. ఇందుకు గల కారణాలను వరించేందుకు పాక్ దౌత్య అధికారులు నిరాకరించారు.
పాకిస్తాన్ లోని తాలిబన్ దౌత్యవేత్త చీటికి మాటికి ప్రతికా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అమెరికాకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రకటలు ఇవ్వడంపై ముషారఫ్ ప్రభుత్వం బుధవారం నుంచి నిప్పులు చెరుగుతున్నది. ఇప్పుడు ఏకంగా కరాచీ లోని దౌత్య కార్యాలయాన్ని మూసి వేయాలని ఆదేశించడం బరితెగింపు గానే భాంచాలి. అమెరికా అండ చూసుకొని ముషారఫ్పెట్రేగిపోతున్నాడనే మర్శలు పాక్ లో వెల్లువెత్తుతున్నాయి.
Comments
Story first published: Thursday, November 8, 2001, 23:53 [IST]