కాబూల్ః నెలరోజులుగా దాడులు జరుపుతున్నా తాలిబన్లను లొంగదీసుకోలేకపోయిన అమెరికన్ వైమానిక దళాలు రెచ్చిపోయి మరింత భీకరంగా బాంబు దాడులు జరుపుతున్నాయి. కొత్తరకాల ఆయుధాలను ప్రయోగిస్తున్నాయి.
డైసీ కట్టర్ వంటి అత్యంత భీకరమైన బాంబులను సైతం ప్రయోగిస్తున్నారు. ఈ బాంబులు భూుకి ఒక dుటర్ ఎత్తులోనే పేలుతుంది. ఈ బాంబు భూుపై కనీసం 260 అడుగుల వ్యాసం గల ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచిపెడుతుంద. ఆ ప్రదేశంలో వున్న చెట్టుచేమ, పశువులు, పక్షులు, మనుషులతో పాటు బండరాళ్లు కూడా నామరూపాలు లేకుండా పోవడం తధ్యం.
అయితే ఈ బాంబు ప్రయోగించిన చోట గొతులు మాత్రం పడవు. అదే దీని ప్రత్యేకత. బుధవారం అర్ధరాత్రి, గురువారం నాడు అమెరికా యుద్ధ మానాలు కాబూల్, కాందహార్తోపాటు అనేక నగరాలపై చ్చలడిగా ఎదురులేకుండా బాంబులను వెదజల్లాయి. ఆల్ ఖైదా నెట్వర్క్ పూర్తిగా ధ్వంసమయిందని అమెరికా చెబుతున్నది.
అమెరికాకు దన్నుగా జపాన్ కూడా తన భారీ యుద్ధనౌకలను రంగంలోకి దించింది. ఈ నౌకలు హిందూమహాసముద్రంలో మొహరించి అమెరికాకు బాసటగా వుంటాయి.పెద్దఎత్తున పదాతి దళాలు కూడా రంగంలోకి దిగినట్టుగా అమెరికా ప్రకటిస్తున్నప్పటికీ భూతల పోరు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని తాలిబన్లు చెబుతున్నారు.