వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాషింగ్టన్ః భారత ప్రధాని వాజ్పేయి గురువారం నాడు వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్ లో ఆయన అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు, భారత్ కు మద్దతు ఇచ్చే బృందాలతో చర్చలు జరిపారు. శుక్రవారం నాడు వాజ్పేయి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తో సమావేశం అవుతారు. వాజ్ పేయి- బుష్ మధ్య చర్చలలో ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం వున్నదని భాస్తున్నారు.వాషింగ్టన్లోఆయనకు అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులుఘనస్వాగతం చెప్పారు.
వాజ్పేయి అమెరికా పర్యటన సందర్భంగా పాక్ అధ్యక్షుడు ముషారఫ్ అక్కడకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ముషారఫ్ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని వాజ్పేయి గురువారం తేల్చి చెప్పారు. అంతగా అవసరం అయితే ముషారఫ్ తో ఢిల్లీలో చర్చలు జరుపుతానని వాజ్పేయి వరించారు.
బుష్ తో వాజ్ పేయి జరిపే చర్చలలో పాకిస్తాన్ వైఖరి కూడా చర్చకు రావచ్చనని భాస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటం కేవలం ఆఫ్ఘనిస్తాన్కే పరిుతం కాకూడదని వాజ్ పేయి బుష్ ను కోరతారు. అదే ధంగా భారత్ - అమెరికా సంబంధాలను పాకిస్తాన్ ప్రభాతం చేయరాదని కూడా వాజ్పేయి కోరే అవకాశం వుంది.
Comments
Story first published: Thursday, November 8, 2001, 23:53 [IST]