జయవాడః కృష్ణానదిపై జయవాడ వద్ద సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ ను రక్షించాల్సిందిగారైతాంగం డిమాండ్ చేసింది. జయవాడ ధర్మల్ పవర్స్టేషన్ కు నీరందించే ఉద్దేశ్యంతో కృష్ణానదిలో నీటిమట్టం ఎప్పుడూ ఒక స్థాయికి తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. పునాదుల వద్ద గత కొన్నేల్ళుగా నిరంతరం నీరు నిల్వ వుండడం వల్ల ప్రకాశం బ్యారేజ్ పునాదులు దెబ్బతింటున్నాయంటూ గగ్గోలు మొదలైంది. పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ మధ్య ఈఅంశంపై ప్రారంభమైన వాదం చినికిచినికి గాలివానగా మారింది.రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ పునాదులను నీటిలోపల కెమేరాలతో పరీక్షించిఅంతా సవ్యంగానే వున్నదని తేల్చింది. అయితే నీటిపారుదల శాఖ వారు, రైతులు సంతృప్తి వ్యక్తం చేయక పోవడంతో శాస్త్రీయంగా బ్యారేజ్ పటిష్ఠతను నిర్ధారించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది.
జయవాడః కృష్ణానదిపై జయవాడ వద్ద సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ ను రక్షించాల్సిందిగారైతాంగం డిమాండ్ చేసింది. జయవాడ ధర్మల్ పవర్స్టేషన్ కు నీరందించే ఉద్దేశ్యంతో కృష్ణానదిలో నీటిమట్టం ఎప్పుడూ ఒక స్థాయికి తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. పునాదుల వద్ద గత కొన్నేల్ళుగా నిరంతరం నీరు నిల్వ వుండడం వల్ల ప్రకాశం బ్యారేజ్ పునాదులు దెబ్బతింటున్నాయంటూ గగ్గోలు మొదలైంది. పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ మధ్య ఈఅంశంపై ప్రారంభమైన వాదం చినికిచినికి గాలివానగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ పునాదులను నీటిలోపల కెమేరాలతో పరీక్షించిఅంతా సవ్యంగానే వున్నదని తేల్చింది. అయితే నీటిపారుదల శాఖ వారు, రైతులు సంతృప్తి వ్యక్తం చేయక పోవడంతో శాస్త్రీయంగా బ్యారేజ్ పటిష్ఠతను నిర్ధారించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది.
దీనితో కేంద్ర జలసంఘం బృందం గురువారం నాడు కృష్ణా బ్యారేజ్ సందర్శించింది. సశాస్త్రీయంగా బ్యారేజ్ పునాదులను పరిశీలించింది.
శుక్రవారం నాడు జయవాడలో ధ వర్గాల ప్రతినిధులను కేంద్రబృందం కలుసుకుంది. ఈ సందర్భంగా కృష్ణా జలాలలపై ఆధారపడిసేద్యం చేసుకొనే రైతులు వందలాదిగా జయవాడ తరలి వచ్చి కృష్ణా బ్యారేజ్ ను రక్షించాల్సిందిగా కేంద్ర జలసంఘ సభ్యులకు నతిపత్రం సమర్పించారు. నాలుగు జిల్లాలలో 15 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఈ బ్యారేజ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.
కెమేరాలతో పునాదులను పరిశీలించిన జలసంఘం కూడా బ్యారేజ్ కు ఇప్పట్లో వచ్చిన ముప్పు ఏdు లేదని చెబుతున్నా 8 ఏళ్ళకుపైగా బ్యారేజ్ పునాదుల వద్ద నిరంతరం నీళ్ళు నిలిచివుంటే బ్యారేజ్ కు నష్ఠం వుండదా అనేది సందేహాస్పదంగానే వుంది.












Click it and Unblock the Notifications
