వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌:అఎn్ఘానిస్థాన్‌లో యుద్ధానికి అమెరికా సిద్ధమై లేదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. గెలుపు కోసం అఎn్ఘానిస్థాన్‌లో పదాతి దళాలు అవసరమని ఆయన అన్నారు. ది వాషింగ్టన్‌ పోస్ట్‌ దిన పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అఎn్ఘానిస్థాన్‌లో జరుగుతున్న పోరు పూర్తి సంతృప్తికరంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌:అఎn్ఘానిస్థాన్‌లో యుద్ధానికి అమెరికా సిద్ధమై లేదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. గెలుపు కోసం అఎn్ఘానిస్థాన్‌లో పదాతి దళాలు అవసరమని ఆయన అన్నారు. ది వాషింగ్టన్‌ పోస్ట్‌ దిన పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అఎn్ఘానిస్థాన్‌లో జరుగుతున్న పోరు పూర్తి సంతృప్తికరంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

తాలిబాన్‌కు, ఒసామాబిన్‌ లాడెన్‌కు, అతని నెట్‌వర్క్‌ ఆల్‌ ఖయిదాకు వ్యతిరేకంగా అమెరికా ఎక్కువగా వైమానిక దాడులకే పరిుతమైందని, కొన్ని సార్లు ఆ దాడులు ఆగిపోయినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. కొన్ని సార్లు దాడులు స్తంభించినట్లు అనిపించి మర్నాడుపెద్ద యెత్తున జరుగుతున్నాయని ఆయన అన్నారు.

అఎn్ఘానిస్థాన్‌లో అమెరికా సైనిక చర్యలు సరైన సమాచారం లేక మందగిస్తున్నాయని, తాలిబాన్‌ను భూభాగంపై ఎదుర్కోవడానికి నార్తర్న్‌ అలయెన్స్‌కు వాషింగ్టన్‌ నుంచి తగిన ఆయుధ సంపత్తి లభించడం లేదని ఆయన అన్నారు.యుద్ధ ఫలితం భూభాగంపై నిర్ధారణ అవుతుందని, ఇది మందకొడిగా సాగుతుందని, దీనికి అమెరికా సిద్ధంగా వున్నట్లు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X