వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రకు తప్పిన వాయుగండం
హైదరాబాద్ః నాలుగురోజులుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వణికిస్తున్న వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు శాఖపట్నంలోని వాతావరణ శాఖ తెలిపింది.పైగా అది తీరానికి దూరంగా కూడా పయనిస్తుండడంతో కోస్తా తీరానికి ఏ మాత్రం ముప్పు వాటిల్లక పోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు రోజుల కిందట కోస్తా ప్రాంతాన్ని, ఆ తరువాత ఉత్తర కోస్తా ప్రాంతాన్ని వాయుగుండం గడగడ లాడించింది. దీపావళి సమయంలో ఆనవాయితీగా వచ్చే తుపాను మళ్ళీ ఎక్కడ వచ్చి పడుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాయుగండం తప్పిపోవడంతో ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
Story first published: Monday, November 12, 2001, 23:53 [IST]