వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీః అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ శిష్యవర్గం అణ్వాస్త్రాలను, జీవాయుధాలను, రసాయనాయుధాలను ఇప్పటికే అమెరికాకు తరలించినట్టుగా పాకిస్తాన్కు చెందిన ఫ్రాంటియర్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తృటిలో మారణహోమం సృష్టించగల ఈ ప్రమాదకర అస్త్రాలను లాడెన్ ఇప్పటికే అమెరికా తరలించాడని అమెరికా, పాకిస్తాన్ ఇంటలీజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.
కనీసం రెండు బ్రీఫ్కేసుల్లో అణ్వాస్త్రాలు అమెరికా చేరివుంటాయని అధికారులు భాస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ అణ్వాస్త్రాలను రష్యాలో తయారయినట్టుగా భాస్తున్నారు. ఈ బ్రీఫ్కేసు అణుబాంబులతో పాటు జీవాయుధాలను కూడా లాడెన్ అనుచరులు అమెరికాకు తరలించినట్టుగా చెబుతున్నారు. కాప్సుల్ రూపంలో వుండే ఈ జీవాయుధాలను జనసమ్మర్ధం వున్న ప్రాంతంలో పేలిస్తే వేలసంఖ్యలో జనం మరణిస్తారు.
Comments
Story first published: Monday, November 12, 2001, 23:53 [IST]