వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోల్కతః ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న మాంద్యం నేపథ్యంలో కోల్కతాలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించి భారీ ఎత్తున సదస్సు జరుగుతున్నది. సిఐఐ సారథ్యంలో ఆది,సోమవారాల్లో జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్ర ఐటి, టెలీకామ్ మంత్రి ప్రమోద్ మహాజన్ ప్రారంభోత్సవం చేస్తారు.
ఈ మూడు రంగాలకు సంబంధించిన బడా నేతలంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో వున్న అనిశ్చితిని గురించి, ఆధునిక టెక్నాలజీ గురించి, కొత్త మార్కెట్లను గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఐటి రంగం డల్గా వున్న కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఇప్పటికీ మంచి అవకాశాలు వున్నాయి. అయితే స్టాక్మార్కెట్లలో మాత్రం ఈ మూడు భాగాల షేర్లు పాతాళానికి జారిపోయాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమపై ఈ సదస్సులో ప్రత్యేక గోష్టిని నిర్వహిస్తున్నారు.
Comments
Story first published: Saturday, November 17, 2001, 23:53 [IST]