వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జ్‌ నియామకంపై పక్షం వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తహల్కా ఆరోపణల్లో ఇరుక్కున్న జార్జ్‌ఫెర్నాండెజ్‌కు మళ్లీ మంత్రిపద కట్టబెట్టడంపై పార్లమెంట్‌లో మంగళవారం నాడు పక్షాలు ప్రధానివాజ్‌పేయిపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తాయి. లోక్‌సభలో పక్ష సభ్యులు ప్రధాని వైఖరిని తప్పుబడుతూ సభనుంచి వాకౌట్‌ చేశారు. జీరో ఆవర్‌లో ఈ షయంపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.

వెంకటస్వాు కుషన్‌ చారణ జరుగుతుండగానే జార్జ్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం అనైతికమని ప్రతిపక్షాలుపేర్కొన్నాయి. ప్రభుత్వ చర్య కుషన్‌ దర్యాప్తును ప్రభాతం చేసే ధంగా వున్నదని వారు ఆరోపించారు.అసలు వాజ్‌పేయి మొదట జార్జ్‌ రాజీనామాను ఎందుకు వద్దన్నారో, ఆ తర్వాత ఎందుకు ఆమోదించారో ఇప్పుడు మళ్లీ మంత్రివర్గంలోకి ఎందుకుతీసుకున్నారో తనకు బోధపడటం లేదని సమాజ్‌వాద్‌ పార్టీ నేత మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు.

జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు ఏ పాపం తెలియదని ప్రధాని వాజ్‌పేయి శ్వసించివుంటే ఆయన రాజీనామానే కోరాల్సింది కాదని చంద్రశేఖర్‌ అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో పోరాటం సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఫెర్నాండెజ్‌ను మళ్లీ రక్షణ మంత్రిగా నియుంచడం దేశభద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వున్నదని చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

ప్రధాని ఈ షయంలో సభకు వరణ ఇవ్వాలని పక్ష సభ్యులుకోరారు. ఫెర్నాండెజ్‌కు ఏ పాపం తెలియదని ప్రకటించడం ద్వారా కుషన్‌ నిచారణను ప్రభాతం చేయడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని సిపిఎం నేత సోమనాత్‌ చటర్జీ ఆరోపించారు. ఈ దశలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఈ గందరగోళం మధ్యనే ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు. వెంకటస్వాు కుషన్‌ జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదనిఅందువల్ల ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం పూర్తిగా సమర్ధనీయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X