హోమ్ పేజి
కాబూల్ః అఎn్గాన్ యుద్ధంలో ఆఖరు అంకం ప్రారంభమైంది. కాందహార్లోనే దాక్కుని వున్న బిన్ లాడెన్, ముల్లా ఒమర్ కోసం అమెరికన్ కమెండోలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు.
ఆరువందలమంది మెరైనర్లు కాందహార్లో దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. మరో వైపు ఈ కమెండోలకు సాయంగా ఆరువేల మంది బ్రిటన్ సైనికులను కూడా పంపిస్తున్నట్టు బ్రిటన్ వెల్లడించింది. రెండురోజులుగా సాగుతున్న భీకర ఘర్షణల్లో మజారే షరీఫ్లో రక్తం మడుగులు కట్టింది. లొంగిపోయిన తాలిబన్ సైనికులను బంధించిన ఒక కోటపై అమెరికన్ యుద్ధ విమానాలు బాంబులు గుప్పించాయి. ఈ చర్యను అమెరికా సమర్ధించుకున్నది. మరణించిన తాలిబన్ సైనికుల్లో స్థానికులు ఎవరూ లేరని అంతా విదేశీ సైనికులేనని అమెరికా వెల్లడించింది.












Click it and Unblock the Notifications
