వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎడ్విన్‌...మేరి కళ్యాణం చూతమురారండి!

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుమలః అమెరికాకు చెందిన ఓ యువజంట తెలుగుసంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒకటైంది. అమెరికాకు చెందిన మేరి, ఎడ్విన్‌ లు ఆదివారం నాడు తిరుమలలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకున్నారు. నుదుటన బాషికం కట్టి, పట్టు వస్త్రాలు ధరించి పెళ్ళి పీటల మీద కూర్చున్న మేరి, ఎడ్విన్‌ తెలుగురాష్ట్రానికి చెందిన మిత్రుల వివాహం చూసి స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఆ స్ఫూర్తితోనే తిరుమల వచ్చి పెళ్ళి చేసుకుంటున్నట్లు వివరించారు.

మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా... అంటూ పురోహితులు వేద మంత్రాల పఠిస్తుండగా ఎడ్వన్‌ మేరి మెడలో మంగళసూత్రం కట్టారు. ఆ తరువాత ఎంతో ఉల్లాసంగా తలంబ్రాలు పోసుకున్నారు. అమెరికా జంట తిరుమలలో సంప్రదాయ పూర్వకంగా వివాహం చేసుకోవడం పలువురిని అలరించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X