వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చలిగాలి, చిరుజల్లులతో గజగజ
హైదరాబాద్ః
రాష్ట్రంలో
వాతావరణం
ఒక్కసారిగా
మారిపోయింది.
చలిగాలులకు
తోడుగా
జల్లులు
ప్రారంభం
కావడంతో
అనేక
ప్రాంతాల్లో
ప్రజలు
సతమతమవుతున్నారు.
తెలంగాణా
జిల్లాల్లో
ముఖ్యంగా
హైదరాబాద్లో
గత
వారం
రోజులుగా
వీస్తున్న
చలిగాలులు
ప్రజాజీవనాన్ని
తీవ్రంగా
ప్రభావితం
చేస్తున్నాయి.
ఉష్టోగ్రత నమోదయింది. ఈ చలిగాలులకు తోడుగా ఆదివారం నాడు నిజామాబాద్, ఆదిలాబాద్, జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. దీంతో పెద్దఎత్తున పంటనష్టం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో 50 ఏళ్ల మహిళ పిడుగుపాటుకు గురై మరణించినట్టుగా చెబుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఆదివారం నాడు కోస్తా తీరమంతా విస్తారంగా వర్షాలు పడ్డాయి. వాతావరణ మార్పులతో చలితీవ్రత ఎక్కువైంది. సోమవారం నాడు హైదరాబాద్లో గడగడవణికించే చలితో పాటు మధ్యాహ్నం 12 గంటలవరకు చిరుజల్లులు కూడా కురిశాయి. సాధారణంగా ఉదయం ఏడుగంటలకల్లా ప్రారంభమయ్యే నగర జీవితం ఈ చలిదెబ్బకు పదిగంటలకు గానీ ప్రారంభం కావడంలేదు. రాత్రి కూడా వ్యాపారస్తులు తొందరగానే దుకాణాలు కట్టేస్తున్నారు. వీధులు కూడా 10 గంటలకల్లా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]