తమిళనాడు గవర్నర్‌ రామ్మోహన రావు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ పి.ఎస్‌. రామ్మోహన రావు తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. మరో రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి శ్యామల్‌ దత్తాను నాగాలాండ్‌ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.

రామ్మోహన్‌రావుకు తమిళనాడుతో పరిచయం వుంది. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో తన విద్యాభ్యాసం చేశారు. కొత్త గవర్నర్‌ నియామకంతో తమిళనాడు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ జాతీయ పతాకను ఆవిష్కరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రంగరాజన్‌ రిజబ్లిక్‌ డే రోజు ఎక్కడ పాల్గొంటారనేది సందిగ్దంగానే వుండిపోయింది. కొత్త గవర్నర్‌ నియామకంతో ఈ సమస్య తీరిపోయింది.

రామ్మోహన్‌ రావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. రామ్మోహన్‌రావుకున్న అపార అనుభవం గవర్నర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడగలదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+