వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముసుగు దొంగల స్వైర విహారం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో శుక్రవారం తెల్లవారు జామున ముసుగు దొంగలు స్వైరవిహారం చేశారు. రెండు ఆర్టీసి బస్సులను, ఒక టాటా సుమోను, ఒక మారుతీ వ్యానును, ఒక మినీ లారీని అడ్డగించి సొమ్ము, నగలు దోచుకున్నారు. ప్రయాణికులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కత్తులు చూపించి బెదిరించారు.
కర్నూలు- గుంటూరు రహదారిపై దోర్నాల- ఆత్మకూరు మధ్యలో ముసుగు దొంగలు దాదాపు గంటన్నర సేపు నానా బీభత్సం సృష్టించారు.

కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ మారుతీ వ్యాను గురువారం రాత్రి శ్రీశైలం నుంచి మంత్రాలయం మీదుగా శబరిమలై వెళ్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆరుగురు ఇందులో ప్రయాణిస్తున్నారు. నల్లమల అరణ్యంలోని పిల్లల ఘాట్‌ వద్ద ఆ వాహనం యాంత్రిక లోపంతో ఆగిపోయింది. మరమ్మతుల కోసం కర్నూలు, ఆత్మకూరులలోని మెకానిక్‌లను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో రాత్రి వారు అక్కడే వుండిపోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా ఎనిమిది మంది సభ్యుల దోపిడీ ముఠా శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల తర్వాత అక్కడికి చేరుకుని దోపిడీకి పాల్పడింది. అదే సమయంలో ఆత్మకూరు నుంచి దోర్నాల వైపు వెళ్తున్న టాటా సుమో, మనీ లారీ వారి కంట పడ్డాయి. వాటిని కూడా అడ్డగించి దోచుకున్నారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసి హైటెక్‌ బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X