వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ తో చర్చల భారం సర్కార్‌ దే!

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః వరంగల్‌ జిల్లా పరకాలలో జలియన్‌ వాలాబాగ్‌ మాదిరిగా తెలంగాణా పోరాటంలో అసువులు బాసిన వారికోసం ఓ స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌ రావు వెల్లడించారు. ఆదివారం నాడు ఆయన వరంగల్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్లతో చర్చలు జరపాలా వద్దా అనే అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వున్నదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తో పాటు వివిధ రాష్ట్రాలకు బెడదగా పరిణమించిన నక్సలైట్లు నిర్మూలించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తున్నదని ఆయన అన్నారు.

దేశంలో తీవ్రవాదం నానాటికీ పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కనీసం రెండు వేల మంది ఐఎస్‌ఏ ఏజెంట్లు వున్నారని, హైదరాబాద్‌ లో కూడా ఐఎస్‌ఐ కదలికలు వున్నందున అప్రమత్తంగా వుండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోనిస్వాతంత్ర సమరయోధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఓ కొత్తపథకానికి ఆమోదం తెలిపినట్లు ఆయనవివరిచారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X