వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెర్ల్‌ చచ్చిపోయాడంటున్న ఓమర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరాచిః కిడ్నాప్‌ నకుగురైన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ జర్నలిస్టు డేనియల్‌పెర్ల్‌ మరణించాడని కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు ఓమర్‌ సయీద్‌షేక్‌ వెల్లడించారు. భారీ బందోబస్తు మధ్య ఓమర్‌ సయీద్‌షేక్‌ ను గురువారం నాడు కరాచీ కోర్టులో హాజరు పరిచారు.పెర్ల్‌ గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా నాకు తెలిసినంతవరకు అతడు చచ్చిపోయాడని ఆయన బదులిచ్చాడు.

అమెరికాలో పర్యటిస్తున్న పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌పెర్ల్‌ బతికే వున్నాడని ప్రకటించిన కొద్దిగంటలకేపెర్ల్‌ చనిపోయాడంటూ ఓమర్‌ షేక్‌ కోర్టులో చెప్పడంవిశేషం. ముస్లిం తీవ్రవాద సంస్థపై పరిశోధనాత్మక వ్యాసం రాసేందుకు వెళ్ళిన 38 ఏళ్ళ డేనియల్‌పెర్ల్‌ జనవరి 23న కిడ్నాప్‌ కు గురయ్యాడు. పెర్ల్‌ బతికే వున్నాడని ఇప్పటి వరకుఅంతా భావిస్తూ వచ్చారు. అమెరికా ఒత్తిడి మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓమర్‌ కోసం పాక్‌ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఓమర్‌ నాటకీయంగా మంగళవారం లాహోర్‌ లో లొంగిపోయాడు.పెర్ల్‌ ను కిడ్నాప్‌ చేయాలన్నది తనకు వచ్చిన ఆలోచనే అని ఓమర్‌ చెప్పాడు. తప్పో ఒప్పో ... నా కారణాలు నాకున్నాయని ఓమర్‌ కోర్టులో చెప్పాడు. పాకిస్తాన్‌ ప్రభుత్వం అమెరికా బానిసలా వ్యవహరించడం నాకు నచ్చలేదని లోగొంతుకతో ఓమర్‌ చెప్పాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X