పాక్‌ మోస్ట్‌ వాటెండ్‌ జాబితా రెడీ

ఇస్లామాబాద్‌ః భారత్‌ సమర్పించిన మోస్ట్‌ వాటెండ్‌లిస్ట్‌కు ప్రతిగా పాకిస్తాన్‌ 48 మంది తీవ్రవాదులపేర్లతో తాను ఒక జాబితాను తయారు చేసింది.వీరంతా పాకిస్తాన్‌లో హేయమైన నేరాలకు పాల్పడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారని ఆ దేశం ఆరోపిస్తున్నది. వారిని తక్షణమే తమకుఅప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ జాబితాను మార్చి మొదటివారంలో భారత్‌కు సమర్పించే అవకాశం వున్నదని చెబుతున్నారు.

ఈ జాబితాలో భారత హోం మంత్రి అద్వానీపేరు వున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చినవిషయం విదితమే. అయితే అద్వానీ పేరు ఈ జాబితాలో లేదని పాకిస్తాన్‌ పత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్‌ రూపొందించిన జాబితాలో అత్యధికులు ఖ్వామీ మూవ్‌మెంట్‌కు చెందిన వారని ఆ పత్రికలు తెలిపాయి.వీరందరికీ భారత్‌ తీవ్రవాదంలో శిక్షణ ఇచ్చి పాకిస్తాన్‌లో హింసాకాండను రెచ్చగొడుతున్నదని పాకిస్తాన్‌ ఆరోపిస్తున్నది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+