వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిటిడి భూముల కబ్జా: సభా సంఘానికి నో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) భూముల కబ్జాపై సభా సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించింది. తిరుపతి, రేణిగుంట, మరో ప్రాంతంలో టిటిడి భూములను అక్రమంగా కబ్జా పెట్టారని, ఈ భూముల స్వాధీనంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించారు. ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వంఅంగీకరించలేదు.

టిటిడి భూములనుస్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు గతంలో సభకు హామీ ఇచ్చారని, ఆ హామీకివిరుద్ధంగా భూకబ్జాదారులపై కేసులు ఎత్తేశారని కాంగ్రెస్‌ సభ్యుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అక్రమాలను సమర్థిస్తోందని ఆయన అన్నారు. వేయి కేసులను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఈ భూములను ఎలా రక్షిస్తారని ఆయన అడిగారు. దాదాపు 200 కోట్ల రూపాయలవిలువ చేసే 584 ఎకరాల భూములు అన్యాక్రాంతంఅయినట్లు కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

టిటిడి భూములను కబ్జాదారుల నుంచిస్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. ఈ కబ్జా వ్యవహారాలపై ఒక కమిటీ వేసి, నివేదిక తెప్పించుకుంటామని, నివేదిక ఆధారంగా భూములనుస్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X