వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం వెంటే మేం: మమత

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఉద్వాసన పలికేవిషయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేవిషయం తమ పార్టీ ఆలోచించడం లేదని ఆమె ఆదివారంవిలేకరులతో చెప్పారు.

ఆదివారంనాడు ఢిల్లీలో జరిగిన ఎన్‌డిఎ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌హాజరు కాలేదు. ఆలస్యంగా వర్తమానం అందడం వల్లనే తాను సమావేశానికిహాజరు కాలేకపోయానని ఆమె చెప్పారు. అంతకు ముందు ఆమె తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో ఫోన్‌లో విస్తృతంగా చర్చలు జరిపారు. చిన్నపెద్ద విషయాలు ఏవి వచ్చినా తెలుగుదేశం మాకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వారికి అండగా నిలవడం మా కర్తవ్యం. పాత మిత్రులే నిజమైనస్నేహితులు. కొత్త మిత్రులు సీజన్లో వచ్చి పోయే పక్షుల్లాంటివారు అని మమత అన్నారు.

తమ వ్యవహారాల్లో మిత్రులు జోక్యం చేసుకోరాదన్న బిజెపి వాదనను ఆమె ఖండించారు. మిత్రపక్షాలు బిజెపి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని, ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకోవడం లేదని, కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సింది తాము కాబట్టి మాట్లాడే నైతిక హక్కు తమకు వుంటుందని, తమ ఒత్తిళ్లు తమకు ఉన్నాయని ఆమె అన్నారు. బిజెపి తప్పులకు మిత్ర పక్షాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X