వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గెలిచిన వాజ్పేయి ప్రభుత్వం
న్యూఢిల్లీ: గుజరాత్పరిణామాలపై ప్రతిపక్షాలు 184వ నిబంధన కింద లోక్సభలో ప్రతిపాదించిన తీర్మానంవీగిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా 276 మంది సభ్యులు ఓటు చేయగా, వ్యతిరేకంగా 185 సభ్యులు ఓటు చేశారు. మొత్తం 466 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు.
అభిశంసన తీర్మానంపై దాదాపు 16 గంటల పాటు చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చకు ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి సమాధానం ఇచ్చారు. మంగళవారం ప్రారంభమైన చర్చ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. బుధవారం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని వాజ్పేయి సమాధానం ముగిసింది. నాలుగున్నర గంటల ప్రాంతంలో లోక్సభలో ఓటింగ్ జరిగింది.
Comments
Story first published: Wednesday, May 1, 2002, 23:53 [IST]