వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎ యుద్ధ భయం సృష్టిసోంది: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుజరాత్లో జరిగిన కిరాతక నేరాల నుంచి దృష్టి మళ్లించడానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వార్‌సైకోసిస్‌ను సృష్టిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు దాసరి నాగభూషణ రావువిమర్శించారు.

సంక్షోభ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అండగా నిలిచాయని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ప్రతి రోజూ యుద్ధం గురించి గగ్గోలు పెట్టడం దేశానికి మంచిది కాదని, వార్‌ ఫోబియాను సృష్టించడానికి ప్రధాని వాజ్‌పేయి కఠిన పదజాలం వాడుతున్నారని ఆయన అన్నారు.ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మనం సంయమనం పాటించాల్సి వుంటుందని ఆయన చెప్పారు. భారత, పాకిస్థాన్‌ అణ్వాస్త్రాలున్నాయని, యుద్ధం ఇరు దేశాలకు కూడా ప్రమాదకరమని ఆయన అన్నారు.

రాష్ట్రపతిగా తిరిగి ఆర్‌కె నారాయణన్‌ను ఎన్నుకోవాలనేవిషయానికి తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు నారాయణన్‌ను రెండోసారి రాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడానికే ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు.నిషిద్ధ పీపుల్స్‌వార్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకు రావడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఇరు వైపులా రాజీ ధోరణి చోటు చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X