వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కుట్ర భగ్నం చేస్తాంః ఫెర్నాండెజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కాశ్మీర్‌ ఎన్నికలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్‌ చేసే ప్రయత్నాలను భారత్‌ సమర్ధంగా తప్పికొడుతుందని భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ వెల్లడించారు. కాశ్మీర్‌ ఎన్నికల నేపధ్యంలో అక్కడ హింసను ప్రేరేపించి, అల్లర్లు సృష్టించేందుకు పాక్‌ ప్రయత్నాలు చేస్తే భారత్‌సేనలు చూస్తూ ఊరుకోవని ఆయన మంగళవారం దూరదర్శన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

పాకిస్తాన్‌ లో వున్న తీవ్రవాదులకు, కాశ్మీర్‌ లో వున్న తీవ్రవాద సంస్థలకు మధ్య జరిగిన సంభాషణలను భారత్‌ సంపాదించిందని ఫెర్నాండెజ్‌ చెప్పారు. కాశ్మీర్‌ ఎన్నికలను భగ్నం చేసేందుకు పాక్‌మిలిటెంట్లను పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ సంభాషణల ద్వారా తెలుస్తున్నదని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నాలను భారత్‌ ఏ మాత్రం సహించదని, అవసరమైతేఅక్టోబర్‌ తరువాత కూడా సరిహద్దుల్లో సేనలను కొనసాగిస్తామని ఫెర్నాండెజ్‌ చెప్పారు.

కాశ్మీర్‌ లో ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడం వాజ్‌పేయి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు. సరిహద్దులో 20 నుంచి 30 శాతం వరకు చొరబాట్లు ఆగాయని అయితే అవి పూర్తిగా తగ్గలేదని ఫెర్నాండెజ్‌ చెప్పారు. అయితే భారత భూభాగలో మూడువేలమందికిపైగా టెర్రరిస్టులు తలదాచుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X