వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్షిక బడ్జెట్‌లో మార్పులు: యనమల

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్ర వార్షికబడ్జెట్‌లో అత్యవసరమైన మార్పులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారంవిజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల నెలకొన్న కరువు దృష్ట్యా వార్షికబడ్జెట్‌లో మార్పులు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరవు సహాయ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కేటాయింపుల్లో మార్పులు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరవు వల్ల పన్నుల వసూళ్లు తగ్గాయని, కరవు వల్ల వ్యాపార, వాణిజ్యాలుదెబ్బ తిని పన్నుల వసూళ్లు తగ్గాయని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతుందని మంత్రి అన్నారు. ఈ ప్రభావంబడ్జెట్‌పై పడిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని, వృత్తిపన్నును ఇక నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలు నేరుగా వసూలు చేసుకుని ఖర్చుపెట్టుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X