వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో ఆరుగురు క్రిస్టియన్ల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో గల క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ కార్యాలయంపై దుండుగులు దాడి చేసి ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.

తీవ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్థాన్‌ అమెరికాతో చేతులు కలిపిన నాటి నుంచి పాకిస్థాన్‌లో తరుచుగా క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి 12 అంతస్థుల రింపా ప్లాజాలోని మూడో అంతస్థులో గల ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ ఆర్గనైజేషన్‌ ఆఫీసుల్లోకి దూసుకెళ్లి పిస్టల్‌తోవిచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. దాడికి పాల్పడింది ఒకడేనా ఇద్దరా అనేది తెలియడం లేదు.

ఆల్‌ ఖైదా, తాలిబాన్‌ అనుకూల సంస్థల ప్రతీకారచర్యల్లో భాగంగానే ఇది జరిగిందని క్రిస్టియన్‌రైట్స్‌ నేత షాబాజ్‌ భట్టి అన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన అన్నారు. దాడులు ఇదే విధంగా కొనసాగితే తమ ప్రాణాల రక్షణకు, చర్చిల, సంస్థల, ఆస్తుల రక్షణకు అంతర్జాతీయ సమాజానికివిజ్ఞప్తి చేయాల్సి వుంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X