విభేదాలు మీడియా సృష్టి: అద్వానీ
న్యూఢిల్లీ: సంఘ్ పరివార్కు, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మధ్య విభేదాలు మీడియా సృష్టేనని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వంపై సంఘ్ పరివార్ సంస్థలు తీవ్రవిమర్శలు చేస్తున్న నేపథ్యంలో అద్వానీ ఆ విధంగా అన్నారు.
బిజెపి సిద్ధాంతానికి దూరమవుతోందని, కాంగ్రెస్ మాదిరిగాఅయిపోతుందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. పార్టీ సిద్ధాంతం సాంస్కృతిక జాతీయవాదమని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనలోని చాలా భాగాలకు సిద్ధాంతంతో పని లేదని ఆయన అన్నారు. ఎన్డిఎ ఉమ్మడి కార్యాచరణకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
