వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమశిక్షణా రాహిత్యాన్నిసహించం: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ నేతల 14వ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఉగ్రవాదంపై పోరుకు సన్నద్ధం కావాలని ప్రారంభసదస్సు పిలుపునిచ్చింది. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదంఅంతానికి, పేదరిక నిర్మూలనకు నడుం బిగించాలని అభిప్రాయపడింది. ప్రజలహక్కులు, పర్యవరణ పరిరక్షణ వంటిఅంశాలపై దృష్టి కేంద్రీకరించాలని అభిప్రాయపడింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సదస్సును ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభస్పీకర్‌ కె. ప్రతిభాభారతి పిలుపునిచ్చారు. పరిపాలనలో పారదర్శకతకు తమ ప్రభుత్వం పట్టం కడుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అమెరికాలోసెప్టెంబర్‌ 11వ తేదీ దాడులు, అనంతరం భారత్‌లోని కాశ్మీర్‌అసెంబ్లీపై దాడి ఉగ్రవాద సమస్య తీవ్రతను తెలియజేస్తున్నదని, ఉగ్రవాదంపై పోరువిషయంలో ప్రపంచం ఏకాభిప్రాయానికి రావడం అవసరమని ఆయన అన్నారు.

దేశంలోని శాసనసభల పనితీరు పట్ల లోక్‌సభస్పీకర్‌ మనోహర్‌ జోషి అసంతృప్తి వ్యక్తం చేశారు.వీటి పనితీరు బాగా లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధికే శాసనసభ్యులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు.

ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో 25 మంది కామన్‌వెల్త్‌ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొత్తం పదిఅంశాలపై సదస్సులో చర్చ జరుగుతుంది. మన దేశంలోనిసీనియర్‌ పార్లమెంటేరియన్లు కూడా కొన్ని అంశాలపై ప్రసంగిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X