వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ తో భారత్‌ చర్చలు జరపాలి

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ తో భారతదేశం తిరిగి చర్చలు ప్రారంభించాలని అమెరికా సూచించింది. భారత్‌ లోకి చొరబాట్లు తగ్గుముఖం పట్టినందున, చర్చలకు ఇదే తగిన సమయమని అమెరికా ప్రభుత్వపు దక్షిణాసియా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి క్రిస్టియానా రోకా అన్నారు.

అంతే కాకుండా పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారప్‌ తన మాటను నిలబెట్టుకున్నందున భారత చర్చల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టాలని ఆమె మంగళవారం విలేకరులతో అన్నారు.

ఇప్పటికీ కొన్ని చొరబాట్లు జరుగుతున్నా, ముషారప్‌ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మేం భావిస్తున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలు కూడా సరిహద్దు వెంబడి దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం ముదాహవమని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X