గుజరాత్ లో మతఘర్షణః 4గురు మృతి
Posted on 31-10-03
అహ్మదాబాద్ః స్ధానిక క్రికెట్మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మతఘర్షణలుగామారి నలుగురి ప్రాణాలను బలిగొంది. 40 మందిగాయపడ్డారు. అహ్మదాబాద్ కు 70 కిలొమీటర్లదూరంలోని విరంగాం అనే పట్టణంలో ఆదివారం ఉదయం ఈ సంఘటనజరిగింది. పట్టణమంతా కర్ఫూ విధించినట్టుఅహ్మదాబాద్ రేంజి డిఐజి ఎకె శర్మ చెప్పారు.విధ్వంసకారులు మూడు దుకాణాలను తగులబెట్టడంతో పోలీసులు గాలిలోకి 20 రౌండ్లు కాల్పులుజరిపారు. మత ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుఅధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications
