Home
Posted on 08-11-03
కైకలూరు: తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర శనివారం కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. కైకలూరు బహిరంగ సభలో ఆయన ఆ విషయం చెప్పారు.
ప్రజలు తమను గెలిపిస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందిస్తామని, ఈ హామీకి తమ పార్టీ అధిష్ఠానం అంగీకారం తెలిపిందని ఆయన చెప్పారు. అన్ని రంగాల్లో విఫలమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, ఫలితంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.