వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 10-11-03
హైదరాబాద్: తెలుగుదేశం ప్రాంతీయ సదస్సులను రద్దు చేశారు. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే ఈ సదస్సులను రద్దు చేస్తూ సోమవారం జిల్లా ఇన్చార్జిల సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు.
ప్రాంతీయ సదస్సులకు బదులుగా జిల్లా సదస్సు నిర్వహించాలని, ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య సమావేశానంతరం విలేకరులతో చెప్పారు. ఈ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించి, ప్రత్యేక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మినీమహానాడు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 13వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Story first published: Monday, November 10, 2003, 23:53 [IST]