వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 10-11-03

దేశం ప్రాంతీయ సదస్సులు రద్దు

హైదరాబాద్‌: తెలుగుదేశం ప్రాంతీయ సదస్సులను రద్దు చేశారు. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే ఈ సదస్సులను రద్దు చేస్తూ సోమవారం జిల్లా ఇన్‌చార్జిల సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు.

ప్రాంతీయ సదస్సులకు బదులుగా జిల్లా సదస్సు నిర్వహించాలని, ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య సమావేశానంతరం విలేకరులతో చెప్పారు. ఈ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించి, ప్రత్యేక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మినీమహానాడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 13వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X