వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 11-11-03
న్యూఢిల్లీ: హురియత్ కాన్ఫరెన్స్తో చర్చలు జరిపే విషయంలో మంత్రివర్గంలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలను ప్రధాని వాజ్పేయి ఖండించారు. ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చర్చలకు అవసరమైన ప్రాతిపదికను రూపొందిస్తారని, దాని ఆధారంగా చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు.
మంగళవారం మాస్కోకు బయలుదేరే ముందు ఆయన కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. ఆరుగురు జర్నలిస్టులకు జైలు శిక్ష విధించాలనే తమిళనాడు అసెంబ్లీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడారా అని అడిగితే జయలలితతో సంభాషణ ఏదీ జరగలేదని ఆయన జవాబిచ్చారు.
Comments
Story first published: Monday, November 10, 2003, 23:53 [IST]