చంద్రబాబును కలిసిన ఇంద్రసేనారెడ్డి
Posted on 12-11-03
హైదరాబాద్: పెన్షనర్ల సంఘం డిమాండ్ లనునెరవేర్చాల్సిందిగా కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రాసేనారెడ్డి కలవడంరాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకత్తించింది. గురువారం ఇంద్రాసేనారెడ్డి ముఖ్యమంత్రినికలిశారు. అయితే, ఈ కలయికకు రాజకీయ కోణంలేదని బీజేపీ పేర్కొంటున్నా, ఇరువురు ముందస్తుగానేసీట్ల అవగహన గురించి చర్చలు జరిపారని ప్రచారంజరుగుతోంది.
ఇందుకు ఊతమిస్తూ, ఇంద్రసేనారెడ్డి రెండు రోజులుగా టీడీపీ ఎన్నికలవిశ్లేషక కమిటీ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డితోచర్చలు జరుపుతున్నారు. ఈ సారి మరిన్ని సీట్లు కావాలని కోరుతోన్న బీజేపీ ఎన్నికల ప్రకటనకుముందే ఓ అవగహన కోసం ప్రయత్నిస్తోంది.ముందస్తు ఎన్నికలను బీజేపీ తొలినుంచిసమర్ధిస్తోంది.












Click it and Unblock the Notifications
