ముందస్తు ఊహించిందే:విద్యాసాగర్
Posted on 13-11-03
హైదరాబాద్: ముందస్తుఅసెంబ్లీ ఎన్నికలు వస్తాయనేది ఊహించిందేనని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత చెన్నమనేనివిద్యాసాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ను ఓడించడానికి తాము శాయశక్తులా కృషి చేస్తామని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
ముందస్తు ఎన్నికల నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కోరికను కూడా తీర్చుకుంటున్నారని, అది కాంగ్రెస్ను ఓడించాలనే కోరిక అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో తమ మైత్రి కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
