అసెంబ్లీ రద్దు, ఆపద్ధర్మ సీఎం బాబు
Posted on 14-11-03
హైదరాబాద్: అసెంబ్లీ రద్దును కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సూర్జీత్ సింగ్ బర్నాలాను శుక్రవారం ఉదయం సమర్పించారు.
తదుపరి ఏర్పాట్లు జరిగేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ చంద్రబాబును కోరారు. అంతకుముందు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఎన్నికలను కోరుతూ అసెంబ్లీ రద్దు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ తీర్మానాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ కు అందచేశారు. అసెంబ్లీ రద్దు అయినప్పటికీ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రులు కూడా యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని ఆయన తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు.












Click it and Unblock the Notifications
