వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉమపై దిగ్విజయ్ పరువు నష్టం దావా
Posted on 17-11-03
భోపాల్: తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు ఉమాభారతిపై పరువు నష్టం దావా వేశారు. ఛీఫ్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ దావాను దాఖలు చేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి బిజెపి అభ్యర్థిఅయిన ఉమాభారతికి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తరఫు న్యాయవాది ఈ నెల 14వ తేదీన నోటిసు ఇచ్చారు.ఇరవై నాలుగు గంటల లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఆయన నోటీసులో చెప్పారు. ఎప్పటికప్పుడు ఉమాభారతి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్అంటున్నారు.
Comments
Story first published: Monday, November 17, 2003, 23:53 [IST]