వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 19-11-03
యాభై సీట్లు కోరనున్న బిజెపి
హైదరాబాద్ఃఅసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కనీసం యాభై స్ధానాలు డిమాండ్ చేయాలని బిజెపి రాష్ట్రశాఖ నిర్ణయించింది.
బుధవారంబిజెపి రాష్ట్ర స్ధాయి పదాదికారుల సమావేశంలో ఈవిషయంపై చర్చ జరిగింది. నాలుగేళ్ళ కాలం రాష్ట్రంలో బిజెపి బలంపెరిగిందని, ఆ మేరకు ఎక్కువ సీట్లను తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సి ఉంటుందని బిజెపి నాయకులు అన్నారు. బిజెపి పదాదికారుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఇతర ముఖ్యనాయకులుపాల్గొన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం- బిజెపి అనుకూల పవనాలువీస్తున్నాయని పార్టీ పదాధికారుల సమావేశానంతరం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాంగ్రెస్ అవకాశవాద పొత్తులకు సిద్ధపడుతోందని ఆయనవిమర్శించారు. గెలుస్తామనే విశ్వాసం, ధైర్యం కాంగ్రెస్కు లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, November 19, 2003, 23:53 [IST]