వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజాస్వామ్య పరువుకు కాంగ్రెస్ చేటు
Posted on 23-11-03
జోధ్ పూర్: నిరాధారఆరోపణలతో రాజ్యంగ వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం ద్వారాకాంగ్రెస్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతంకలిగిస్తోందని ప్రధాని వాజ్ పేయి విమర్శించారు. తన క్యాబినెట్ లోని ఆరుగురు మంత్రులపైవచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.కాంగ్రెస్ వారిపై చేసిన ఆరోపణలు ప్రజాస్వామ్య పరువు పోతుందనిఆయన ఆదివారం జోధ్ పూర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలోఅన్నారు.
ఇటువంటి శక్తులనుఅధికారంలోకి రాకుండా ప్రజలు అడ్డుకోవాలని ఆయనపిలుపునిచ్చారు. కేంద్ర నిఘా సంస్థకమీషనర్ తోనూ, క్యాబినెట్ కార్యదర్శితోనూనేను మాట్లాడా. మా మంత్రులపై వచ్చినఆరోపణలు నిరాధారమైనవని వారుస్పష్టంచేశారని ఆయన తెలిపారు.
Comments
Story first published: Sunday, November 23, 2003, 23:53 [IST]