వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగో టెస్టు:మారని భారత్‌ బ్యాటింగ్‌ తీరు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:ఆస్ట్రేలియా, భారత క్రికెట్‌ జట్ల మధ్యజరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కుబుధవారం తొలి రోజు ఆటకు వర్షం ఆటంకంకలిగించింది. మ్యాచ్‌ జరిగిన కొద్ది సేపట్లోభారత్‌ తన ఇద్దరు ఓపెనర్లనూకోల్పోయింది.

టాస్‌గెలిచిన భారత కెప్టెన్‌ రాహుల్‌ద్రావిడ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వర్షంకారణంగా ఆట మధ్యాహ్నం రెండుగంటల తర్వాత ప్రారంభమైంది.కొత్త ఓపెనర్‌ గౌతం గంభీర్‌తోకలసి వీరేంద్ర సెహ్వాగ్‌ భారతఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. గంభీర్‌మూడు పరగులకు అవుట్‌ కాగా, సెహ్వాగ్‌ఎనిమిది పరగులకే పెవిలియన్‌ దారి పట్టాడు.కేవలం పన్నెండు పరగులకు రెండువికెట్లు కోల్పోయింది. మెక్‌గ్రాత్‌, జిలెస్పీచెరో వికెట్‌ తీసుకున్నారు. అనంతరంబ్యాటింగ్‌కు దిగిన సచిన్‌ టెండూల్కర్‌,రాహుల్‌ ద్రావిడ్‌ ఆట ముగిసే సమయానికిక్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌ ద్రావిడ్‌ తొమ్మిదిపరుగులతోనూ, సచిన్‌ టెండూల్కర్‌రెండు పరుగులతోనూ ఆడుతున్నారు.మొదటి రోజు కేవలం పదకొండుఓవర్ల ఆట మాత్రమే నడిచింది. ఆట ముగిసేసమయానికి భారత్‌ రెండు వికెట్లుకోల్పోయి ఇరవై రెండు పరుగులుచేసింది.

ప్రస్తుతంజరుగుతున్న నాలుగో టెస్టుకు భారత్‌భారీ మార్పులు చేయగా, ఆస్ట్రేలియా కెప్టెన్‌రికీ పాంటింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు.షేన్‌వార్న్‌ ఈ టెస్టులో ఆడటం లేదు.భారత్‌ జట్టులోకి ఓపెనర్‌గా గంభీర్‌రాగా, వికెట్‌ కీపర్‌గా పార్థివ్‌ పటేల్‌స్థానంలో దినేష్‌ కార్తిక్‌ వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X