వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవసరమైతేనక్సలైట్లపై నిషేధం: హోంమంత్రి
హైదరాబాద్:అత్యవసరమైతే నక్సలైట్లపై నిషేధం విధిస్తామని హోం మంత్రికె.జానారెడ్డి శనివారం ప్రకటించారు. చిలకలూరిపేటలో నక్సలైట్ల దాడిలోమరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులను పరామర్శించినఅనంతరం ఆయన మీడియాప్రతినిధులతో మాట్లాడారు. గుంటూరుప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న చిలకలూరి పేట పోలీసుఉద్యోగుల మృతదేహాలను ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి దర్శించి నివాళి ఘటించారు. మరణించిన సర్కిల్ఇన్ స్పెక్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకుపన్నెండు లక్షలు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులకు తొమ్మిది లక్ష ల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిప్రకటించారు.
Comments
Story first published: Saturday, March 12, 2005, 23:53 [IST]