వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గండిపేటలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ స్కూల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమీపంలోని గండిపేటలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ స్కూల్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు ఈ స్కూల్‌లో ఉచిత విద్యను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 138 మందికి ఈ స్కూల్‌లో ప్రవేశం కల్పించినట్లు ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చరుకుగా పాల్గొంటుందని ఆయన చెప్పారు. ఈ స్కూల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యనందిస్తారు.

ఈ స్కూల్‌ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీదేవితో కలిసి హాజరయ్యారు. ఎన్‌. టి. రామారావు కుటుంబసభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీనటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణతో పాటు ఆయన సోదరులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. పార్టీ బరువును తమ భుజస్కంధాల మీద మోసిన పార్టీ కార్యకర్తలకు ఈ స్కూల్‌లో విద్యనందించాని అనుకుంటున్నట్లు హరికృష్ణ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X