వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్‌, రాణీముఖర్జీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మంగల్‌ పాండే సినిమా నటీనటులు అమీర్‌ఖాన్‌, రాణీ ముఖర్జీలకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా నిర్మాతలు బాబా బేడీ దీపాసాహీలకు, దర్శకుడు కేతన్‌ మెహతాకు, కథా రచయిత ఫరూఖ్‌ దోండీకి, డిస్ట్రిబ్యూటర్‌ యాష్‌ చోప్రాకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సినిమా ప్రదర్శను ఆపించాలని కోరుతూ మంగల్‌ పాండే వారసులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోగా సమాధానాలు ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది.

మంగల్‌ పాండే వారసులు రఘునాథ్‌, ఓంకార్‌నాథ్‌ పాండేల తరఫున ఎం.టి. సిద్దిఖి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కోటి రూపాయల నష్టపరిహారాన్ని కూడా వారు కోరారు. తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు మంగల్‌పాండేకు అప్రతిష్ట తెచ్చే విధంగా పాత్రను సృష్టించడాన్ని, ముఖ్యంగా వేశ్యతో మంగల్‌పాండేకు సంబంధం ఉన్నట్లు చిత్రీకరించడాన్ని పిటిషనర్లు తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X