వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్: కిడ్నాపైన బ్యాంక్ మేనేజర్ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews


విశాఖపట్నం: వైజాగ్ లో కిడ్నాపైన బ్యాంక్ మేనేజర్ హత్యకు గురయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విశాఖపట్నం ద్వారకానగర్ బ్రాంచ్ మేనేజర్ కెకె ప్రసాద్ ను దుండగులు గురువారం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.

బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ మృతదేహం శనివారం ఉదయం సాంగివలస వద్ద రోడ్డుపై లభ్యమైంది. ప్రసాద్ ను పెట్రోల్ పోసి కాల్చి చంపారు. బిల్డర్ ల నుంచి బకాయిలను వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించి ఆస్తులను జప్తు చేసినందుకు వారు కక్షగట్టి ఆయనను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X