వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవి ఏనుగులకు భయపడిన ఏనుగు పరారీ

By Staff
|
Google Oneindia TeluguNews


విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల పాలిటి శాపంగా పరిణమించిన అడవి ఏనుగులను అదుపు చేయడానికి చేపట్టిన ఆపరేషన్ గజేంద్ర కార్యక్రమం అనేక అడ్డంకుల మధ్య కొనసాగుతోంది. అడవి ఏనుగులను చూసి చిత్తూరు నుంచి రప్పించిన మచ్చిక ఏనుగు పారిపోతోంది. అడవి ఏనుగుల బెడదను తొలగించడానికి ఈ ఏనుగును రప్పించారు.

ఇదిలావుంటే, అస్సాం నుంచి వచ్చిన విజయేంద్ర చౌదరి అడవి ఏనుగులను పట్టుకోవడానికి తన పని మొదలు పెట్టారు. మత్తు రైఫిళ్లను అడవి ఏనుగులకు గురి పెట్టి కాల్చారు. దాంతో రెండు ఏనుగులు మత్తుతో పడిపోయాయి. వాటిని తాళ్లతో బంధించారు. అయితే మత్తు వదిలే లోగానే వాటిని తరలించడానికి తగిన సిబ్బంది అందుబాటులో లేరు. ఈ హడావిడికి మిగతా ఏనుగులు పారిపోయాయి. ఏనుగుల దాడిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు పది మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X