ఆరేళ్ల బాలుడి దారుణ హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగుడాలో ఆరేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్కూల్ యూనిఫాం బెల్టుతో మెడకు ఉరి పెట్టి ఆ బాలుణ్ని దుండగులు హత్య చేశారు. జగజ్జీత్ అనే ఈ బాలుడి శవాన్ని పోలీసులు తిరుమల వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం కనుక్కున్నారు.
జగజ్జీత్ అనే ఈ బాలుడు గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆ బాలుడు శవమై కనిపించాడు. మానసిక రోగులు ఆ బాలుడిని లైంగికంగా వేధించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
