వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ కిడ్నాప్ కుట్ర భగ్నం

By Staff
|
Google Oneindia TeluguNews


లక్నో: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కిడ్నాప్ కుట్రను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టుతో ఆ కుట్ర విషయం తెలిసింది. ఈ ముగ్గురు కూడా జైష్ -ఎ - మహ్మద్ ఉగ్రవాదులు. ముగ్గురు కూడా పాకిస్తానుకు చెందినవారే. రాహుల్ గాంధీని కిడ్నాప్ చేసి భారతదేశంలోని జైళ్లలో ఉన్న 42 మంది తమ అనుచరులను విడిపించుకోవాలనేది జైష్ - ఎ - మొహ్మద్ తీవ్రవాదుల ఆలోచనగా భావిస్తున్నారు.

అరెస్టయిన తీవ్రవాదుల నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్ టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్ టాప్ లో రాహుల్ పేరుతో పాటు పలువురి పేర్లన్నాయి. వారి నుంచి పోలీసులు రెండు ఎకె - 47 రైఫిళ్లు, మూడు చైనీస్ పిస్టళ్లు, 5 కిలోల ఆర్డీయెక్స్ స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులతో ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు ఆ ముగ్గురు తీవ్వవాదులను అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X