యుపిలో వరుస పేలుళ్లు: 25 మంది మృతి
లక్నో:
ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలో
మూడు
చోట్ల
శుక్రవారం
మధ్యాహ్నం
వరుసగా
బాంబులు
పేలాయి.
ఈ
పేలుళ్లలో
25
మంది
మరణించినట్లు
సమాచారం.
ఈ
సంఖ్య
మరింత
పెరిగే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.
లక్నో,
వారణాసి,
ఫైజాబాదులలోని
కోర్టు
ఆవరణల్లో
ఈ
బాంబులు
పేలాయి.
లక్నోలో
ఆరుగురు,
వారణాసితో
ఏడుగురు
మరణించినట్లు
భావిస్తున్నారు.
ఫైజాబాదులో
12
మంది
మరణించారు.
వీరిలో
ముగ్గురు
న్యాయవాదులున్నారు.
ఈ
పేలుళ్లలో
పలువురు
గాయపడ్డారు.
ఫైజాబాదులో
మరో
పేలని
బాంబు
కూడా
లభ్యమైంది.
ఈ
పేలుళ్లన్ని
ఐదు,
పది
నిమిషాల
వ్యవధిలోనే
సంభవించాయి.
సైకిళ్లపై
బాంబులు
అమర్చి
పేల్చివేశారు.
ఇది
ఉగ్రవాదుల
పనేనని
కేంద్ర
ప్రభుత్వం
ప్రకటించింది.
రాహుల్
గాంధీ
కుట్రను
పోలీసులు
విఫలం
చేసిన
నేపధ్యంలో
ఈ
బాంబు
పేలుళ్లు
సంభవించాయి.
ఫైజాబాదు
కోర్టులో
ఒకటికన్నా
ఎక్కువ
పేలుళ్లు
సంభవించి
ఉంటాయని
పోలీసులు
భావిస్తున్నారు.
ఇంకా
పేలని
బాంబులు
ఉండవచ్చునని
అనుమానిస్తున్నారు.
ఈ
పేలుళ్ల
నేపధ్యంలో
ఢిల్లీ,
ముంబయి,
హైదరాబాదుల్లో
హై
అలర్ట్
ప్రకటించారు.