వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో వరుస పేలుళ్లు: 25 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల శుక్రవారం మధ్యాహ్నం వరుసగా బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 25 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నో, వారణాసి, ఫైజాబాదులలోని కోర్టు ఆవరణల్లో ఈ బాంబులు పేలాయి. లక్నోలో ఆరుగురు, వారణాసితో ఏడుగురు మరణించినట్లు భావిస్తున్నారు. ఫైజాబాదులో 12 మంది మరణించారు. వీరిలో ముగ్గురు న్యాయవాదులున్నారు. ఈ పేలుళ్లలో పలువురు గాయపడ్డారు. ఫైజాబాదులో మరో పేలని బాంబు కూడా లభ్యమైంది. ఈ పేలుళ్లన్ని ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.

సైకిళ్లపై బాంబులు అమర్చి పేల్చివేశారు. ఇది ఉగ్రవాదుల పనేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాహుల్ గాంధీ కుట్రను పోలీసులు విఫలం చేసిన నేపధ్యంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఫైజాబాదు కోర్టులో ఒకటికన్నా ఎక్కువ పేలుళ్లు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పేలని బాంబులు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్ల నేపధ్యంలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాదుల్లో హై అలర్ట్ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X