అతిసారాతో విద్యార్థిని మృతి: 22 మందికి అస్వస్థత
విశాఖపట్నం: అతిసారా వ్యాధితో విశాఖపట్నంలోని ఎస్సీ హాస్టల్ లో భాగ్యలత అనే విద్యార్థిని మరణించింది. చిట్టివలస గ్రామానికి చెందిన భాగ్యలత బిఎస్సీ చదువుతోంది. అతిసారాతో ఈ హాస్టల్ లో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారం రోజులుగా వసతిగృహంలో అతిసారా ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు విమర్శిస్తున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు విశాఖపట్నంలో మానవహారం నిర్మించి రాస్తారోకో చేశారు.












Click it and Unblock the Notifications
